ఏపీలో ఒక్కరోజే 43 కరోనా మరణాలు

- July 14, 2020 , by Maagulf
ఏపీలో ఒక్కరోజే 43 కరోనా మరణాలు

అమరావతి:ఏపీలో కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1908 కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ర్టవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 33019కి చేరింది. ఇందులో 15144 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారి నుండి 17467 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 408కి చేరింది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com