కువైట్:గుండెపోటు తో ఏ.పి వాసి మృతి
- July 18, 2020
కువైట్ సిటీ:వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం చక్రంపేట గ్రామానికి చెందిన లింగాల ఈశ్వర్ రెడ్డి (48) గత 15 సంవత్సరాలు గా కువైట్ లో టైలర్ గా కువైటీ ఇంట్లో పని చేసుకుంటున్నారు. ఈ నెల 13 వ తేదీ సాయంత్రం తీవ్ర గుండెపోటు రావడం వలన మృతి చెందారు.ఇతనికి భార్య,ఒక కుమారుడు ఉన్నారు. భార్య, కొడుకు కువైట్ లోనే వుండి దాదపు రెండు సంవత్సరాల క్రితమే ఇండియాకు పోయారు.లింగాల ఈశ్వర్ రెడ్డి మృతిచెందిన విషయాన్ని వైయస్ఆర్సిపి కువైట్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు ద్వారా ముమ్మడి బాలిరెడ్డి దృష్టికి తీసుకోని రాగా ఆయన వెంటనే స్పందించి ,కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఇమిగ్రేషన్ పనులన్నీ పూర్తి చేయించినారు. బాడీ బాక్స్ మరియు టికెట్ ఖర్చులు మృతుని బందువులు సమకూర్చారు.చెన్నై నుండి స్వస్ధలం చక్రంపేట వరకు అంబులెన్స్ ఉచితంగా ఏపిఎన్ఆర్టీఎస్ వారు, ఏర్పాటు చేశారు.
ఈ సందర్భముగా ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యుల అభ్యర్ధన మేరకు ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేసినందుకు మేడపాటి వెంకట్(APNRTS ఛైర్మన్),బి.హెచ్ ఇలియాస్(APNRTS డైరెక్టర్) కి, వైయస్సార్సీపి కువైట్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపుతూ ఈశ్వర్ రెడ్డి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేశారు. మృతదేహం ఖతార్ ఎయిర్వేస్ విమానం ద్వారా కువైట్ నుండి ఈ రోజు ఉదయం చెన్నై విమానాశ్రయం చేరుకొని అక్కడ నండి చక్రంపేట కు పంపిస్తారు .
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







