షార్జా:నకిలీ బంగారు నాణేలు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు..8 మంది అరెస్ట్
- July 19, 2020
షార్జా:నకిలీ బంగారు నాణేలు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది సభ్యులు ఉన్న ఈ ముఠా కొన్నాళ్లుగా మోసాలకు పాల్పడుతోంది. అమాయకులను టార్గెట్ గా చేసుకొని..వారిని బురిడి కొట్టిస్తారు. ముందుగా బంగారు నాణేలు చూపించి డీల్ కుదుర్చుకుంటారు. డబ్బు చేతిలో పడగానే నకిలీ బంగారు నాణేలు ఉన్న బ్యాగులను ఇచ్చి అక్కడి నుంచి క్షణాల్లో పరారవుతారు. ఇలాగే మోసపోయిన ఇద్దరు ప్రవాసీయులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వ్యవహారం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టగా..ఓ అసియా వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతని నుంచి రెండు బ్యాగుల నిండా నకిలీ బంగారు నాణేలు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన అసియా వ్యక్తి ద్వారా మిగిలిన ముఠా సభ్యుల సమాచారం కూడా పోలీసులు తెలుసుకున్నారు. దీంతో అందర్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి న్యాయవిచారణకు కేసును బదిలీ చేశారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







