మస్కట్:రెంట్,లీజ్ అగ్రిమెంట్ తప్పనిసరిగా చేయించాలని మున్సిపాలిటీ అధికారుల హెచ్చరిక
- July 19, 2020
మస్కట్ మున్సిపాలిటి పరిధిలోని భవన యజమానులు అందరూ తమ భవనాలను కిరాయి,లీజ్ ఇచ్చేందుకు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మున్సిపాలిటి అధికారులు హెచ్చరించారు. భవనాలను కిరాయి ఇచ్చినా, ఇతరులకు లీజ్ కు ఇచ్చినా ఆ మొత్తంలో 5 శాతాన్ని మున్సిపాలిటికి అడ్మినిస్ట్రేటీవ్ ఫీ కింద చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో నగరంలో చాలా మంది భవన యజమానాలు అడ్మినిస్ట్రేటీవ్ ఫీని తప్పించుకునేందుకు ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండానే అద్దెకు ఇస్తున్నారు. మరికొందరు వాస్తవ అద్దె మొత్తానికి బదులు చాలా తక్కువగా అద్దెను చూపిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నారు. తమ తనిఖీలో ఇలాంటి ఉల్లంఘనలు పెద్ద సంఖ్యలో గుర్తించామని, ఇది మున్సిపాలిటీ ఆదాయంపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు. కిరాయిదారులు కూడా తాము అద్దెకు తీసుకునే ముందు కిరాయి ఒప్పందానికి సంబంధించి మున్సిపాలిటీలో రిజిస్టర్ చేసుకునేలా యజమానాలకు సూచించాలని కోరింది. తద్వారా భవిష్యత్తులో అద్దెకు సంబంధించి నిబంధనలను పక్కగా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని వివరించింది. ముఖ్యంగా ప్రవాసీయుల నివాసానికి సంబంధించి రెంట్ అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్ల ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామని మున్సిపాలిటి అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?