మెడికల్ టూరిజంపై దుబాయ్ ఫోకస్...5 లక్షల మంది టార్గెట్
- July 22, 2020
దుబాయ్:కరోనా మహమ్మారిపై విజయవంతంగా పోరాడుతున్న దుబాయ్ ఆరోగ్య అధికార విభాగం..ఇక మెడికల్ టూరిజంపై ఫోకస్ చేసింది. అనారోగ్యం పాలైన వారికి అత్యుత్తమ చికిత్స అందించగల సత్తా తమకు ఉందని కరోనా మహమ్మారిపై తాము అనుసరించిన విధానాలు మరోసారి రుజువు చేశాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 5 లక్షల మంది రిసీవ్ చేసుకునేలా కసరత్తు చేస్తోంది దుబాయ్ ఆరోగ్య అధికార విభాగం. నిజానికి కరోనా వ్యాప్తి చెందిన తొలినాళ్లలో యూఏఈలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ పోయాయి. అయితే..ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు సమన్వయంతో కరోనాపై చేసిన పోరు సత్ఫలితాలను ఇచ్చింది. ఒక్కరోజులో గరిష్టంగా 900 వరకు కేసులు నమోదవగా..ప్రస్తుతం ఒక్క రోజులో 300 వరకు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు..కరోనాను ఎదుర్కోవటంలో దుబాయ్ ఆరోగ్య శాఖ అనుసరించిన విధానాలతో మృత్యురేటు కేవలం 0.6కి పరిమితం అయ్యింది. అలాగే కరోనా రికవరి రేటు 80 శాతానికిపైగా నమోదవుతోంది. ఇక యూఏఈలో ఇప్పటివరకు 40 లక్షల మందికి కోవిడ్ పీసీఆర్ టెస్టులు నిర్వహించగా..ఒక్క దుబాయ్ లోనే 9.5 మిలియన్ల మందికి పరీక్షలు నిర్వహించి కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగారు. ఈ సక్సెస్ ఫుల్ గ్రాఫ్ తో వైద్య పరంగా మరోసారి సత్తా చాటుకుందని, ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి వైద్య సేవలు అందించేందుకు దుబాయ్ సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు.కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపడుతూనే మెడికల్ టూరిజమ్ పై ఫోకస్ చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







