అబుధాబి నుంచి భారత్ బయల్దేరిన రాఫెల్ యుద్ధ విమానాలు

- July 29, 2020 , by Maagulf
అబుధాబి నుంచి భారత్ బయల్దేరిన రాఫెల్ యుద్ధ విమానాలు

అబుధాబి:అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు కాస్సేపట్లో అల్ దఫ్రా ఎయిర్బేస్,అబుధాబి నుంచి భారత్‌కు చేరుకోనున్నాయి.ఈ మధ్యాహ్నానికి హర్యానాలోని అంబాలాలో గల భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ఇవి ల్యాండ్ కాబోతున్నాయి.రాఫెల్‌ ల్యాండింగ్ కోసం భారత్ ఎదురుచూస్తున్న తరుణంలో.. ఈ రోజు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ వద్ద రాఫెల్ ల్యాండ్ అయిన తరువాత ఐదు రాఫెల్ యుద్ధ విమానాలకు 'వాటర్ సెల్యూట్' ఇవ్వబడుతుంది. రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చేశాయి, 2021లోపు భారత్‌కు రానున్న 36 విమానాలు, గాలిలో ఇంధనాన్ని నింపుకుని 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం.

ఈ కార్యక్రమాన్ని ఎయిర్‌బేస్‌లో వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా నిర్వహించనున్నారు. మొదటగా ఐదు రాఫెల్ జెట్లు  అంబాలా ఎయిర్‌బేస్‌కు రానున్నాయి. వీటిని రిసీవ్ చేసుకోవడానికి వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా  అంబాలాలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com