తెలంగాణలో 1,989 కరోనా పాజిటివ్ కేసులు
- July 31, 2020
హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,989 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 62,703కు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గురువారం ఒక్కరోజే కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 519కి చేరింది. కరోనా నుంచి కోలుకుని గత 24 గంటల్లో 816 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,796 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో 586 GHMC పరిధిలో వెలుగు చూశాయి. మిగిలిన వాటిలో మేడ్చల్-207, రంగారెడ్డి-205, వరంగల్ అర్బన్-123, కరీంనగర్-116, సంగారెడ్డి-108, మెదక్-45, ఖమ్మం-41, మహబూబ్నగర్- 61, నల్గొండ-36, మంచిర్యాల-35, గద్వాల-32, నాగర్ కర్నూలు-30, వరంగల్ గ్రామీణ జిల్లా-30, భద్రాద్రి కొత్తగూడెం-29, ములుగు-27, పెద్దపల్లి-26, సిరిసిల్ల-23, జనగామ-21, సిద్ధిపేట జిల్లా-20 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..