తెలంగాణలో 1,989 కరోనా పాజిటివ్ కేసులు
- July 31, 2020హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,989 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 62,703కు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గురువారం ఒక్కరోజే కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 519కి చేరింది. కరోనా నుంచి కోలుకుని గత 24 గంటల్లో 816 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,796 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో 586 GHMC పరిధిలో వెలుగు చూశాయి. మిగిలిన వాటిలో మేడ్చల్-207, రంగారెడ్డి-205, వరంగల్ అర్బన్-123, కరీంనగర్-116, సంగారెడ్డి-108, మెదక్-45, ఖమ్మం-41, మహబూబ్నగర్- 61, నల్గొండ-36, మంచిర్యాల-35, గద్వాల-32, నాగర్ కర్నూలు-30, వరంగల్ గ్రామీణ జిల్లా-30, భద్రాద్రి కొత్తగూడెం-29, ములుగు-27, పెద్దపల్లి-26, సిరిసిల్ల-23, జనగామ-21, సిద్ధిపేట జిల్లా-20 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
« Older Article Shoppers' Excitement peaks with EXclusive Weekend deals,Super Sales & Citywide Offers during DSS
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్