యూఏఈ లేబర్ చట్టాలకు భారతీయ ప్రతినిథుల ప్రశంస
- February 05, 2016
యూఏఈ కొత్త లేబర్ చట్టాలను భారత ప్రతినిథుల బృందం ప్రశంసించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టాలు కార్మికుల రక్షణ కోసం ఉపయోగపడ్తున్నాయని కొనియాడారు ప్రతినిథులు. ఏజెంట్ల మోసాల నుంచి ఈ కొత్త చట్టాలు కార్మికులకు రక్షణ కల్పిస్తాయని ప్రతినిథులు చెబుతూ, కార్మికుల రక్షణ కోసం చట్టాలు తీసుకు వచ్చిన యూఏఈ పాలకులను ప్రశంసించారు. యూఏఈలో 2.6 మిలియన్ల మంది ఇండియన్స్ ఉన్నారు. వీరిలో 65 శాతం మంది కార్మికులని ఫస్ట్ సెక్రెటరీ కమ్యూనిటీ ఎఫైర్స్, ఎంబసీ ఆఫ్ ఇండియా, యూఏఈ దినేష్ కుమార్ చెప్పారు. స్వదేశంలో ఒకరకమైన ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులు, యూఏఈకి వచ్చాక ఏజెంట్ల ద్వారా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తుందనీ ఈ కారణంగా యూఏఈలో వలస కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తుందనీ, ఈ నేపథ్యంలో కొత్త చట్టాలు వారికి ఎంతగానో ఉపశమనం కల్పిస్తాయని అధికారులు చెప్పారు. భారతదేశం కూడా ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని యూఏఈ ప్రతినిథులు, అలాగే యూఏఈలో ఇండియా రాయబారి చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









