యూఏఈ లేబర్ చట్టాలకు భారతీయ ప్రతినిథుల ప్రశంస
- February 05, 2016
యూఏఈ కొత్త లేబర్ చట్టాలను భారత ప్రతినిథుల బృందం ప్రశంసించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టాలు కార్మికుల రక్షణ కోసం ఉపయోగపడ్తున్నాయని కొనియాడారు ప్రతినిథులు. ఏజెంట్ల మోసాల నుంచి ఈ కొత్త చట్టాలు కార్మికులకు రక్షణ కల్పిస్తాయని ప్రతినిథులు చెబుతూ, కార్మికుల రక్షణ కోసం చట్టాలు తీసుకు వచ్చిన యూఏఈ పాలకులను ప్రశంసించారు. యూఏఈలో 2.6 మిలియన్ల మంది ఇండియన్స్ ఉన్నారు. వీరిలో 65 శాతం మంది కార్మికులని ఫస్ట్ సెక్రెటరీ కమ్యూనిటీ ఎఫైర్స్, ఎంబసీ ఆఫ్ ఇండియా, యూఏఈ దినేష్ కుమార్ చెప్పారు. స్వదేశంలో ఒకరకమైన ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులు, యూఏఈకి వచ్చాక ఏజెంట్ల ద్వారా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తుందనీ ఈ కారణంగా యూఏఈలో వలస కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తుందనీ, ఈ నేపథ్యంలో కొత్త చట్టాలు వారికి ఎంతగానో ఉపశమనం కల్పిస్తాయని అధికారులు చెప్పారు. భారతదేశం కూడా ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని యూఏఈ ప్రతినిథులు, అలాగే యూఏఈలో ఇండియా రాయబారి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







