ఏపీలో 9,024 కరోనా కేసులు, 87 మరణాలు
- August 11, 2020
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో 9,024 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్ పద్ధతిలో, 30,908 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,549 కు చేరింది. కొత్తగా 9,113 మంది వైరస్ బాధితులు కోలుకుని మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,54,749 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 87,597 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో కొత్తగా 87 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2203 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,92,619 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్
- ట్రైనీ ఐఏఎస్ అధికారులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిశానిర్దేశం
- బహ్రెయిన్ లో డెలివరీ మోటార్ బైక్ల నియంత్రణకు అధ్యయనం..!!
- దుబాయ్ ఫ్లైట్ ఎక్కే గంటల ముందు..కేరళలో దంపతులు అనుమానస్పద మృతి..!!
- ఏప్రిల్లో అబ్షర్ లో 16.5 మిలియన్లకు పైగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు..!!
- జి.వి.శ్రీనివాస్ ను ఘనంగా సత్కారించిన ISC ఒమన్..!!
- వ్యక్తిగత డేటా షేరింగ్ చెక్లిస్ట్ ను ప్రారంభించిన NCSA..!!









