యూఏఈ - ఇజ్రాయెల్ డీల్తో మిడిల్ ఈస్ట్ శాంతి చర్చల పునఃప్రారంభం
- August 15, 2020
జెరూసలెం: యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య జరిగిన తాజా ఒప్పందాలతో మిడిల్ ఈస్ట్ శాంతి చర్చల్లో మంచి ముందడుగు పడినట్లు ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇతర దేశాలతోనూ ఇజ్రాయెల్ ఇలాగే సంబంధాలు పెంచుకోవాలని ఆకాంక్షించారు. పాలస్తీనియన్ భూముల నుంచి వైదొలగడానికి సంబంధించి ఇజ్రాయెల్ చేసిన ప్రకటనను ప్రపంచ దేశాలు ఆహ్వానించాయి. బహ్రెయిన్ అలాగే ఒమన్ కూడా ఈ డీల్ని ఆహ్వానించాయి. ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యూఏఈని నెతన్యాహు సహా పలువురు ప్రముఖులు అభినందించారు. రీజియన్లో శాంతి మరింత పెరిగేందుకు ఈ డీల్ ఉపయోగపడ్తుందని ఈజిప్టియన్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసి పేర్కొన్నారు. చైనా కూడా ఈ పరిణామాలపై హర్షం వ్యక్తం చేసింది. జర్మనీతోపాటు ఐక్యరాజ్య సమితి కూడా తాజా పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించడం గమనార్హం.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







