ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి
- May 22, 2026
ఎవరెస్ట్ శిఖరం పై ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వైపు తిరిగి వస్తుండగా ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందారు. ఈ విషయాన్ని నేపాల్ అధికారులు వెల్లడించారు. మృతులు ఒకరు అరుణ్ కుమార్ తివారీ, మరొకరు సందీప్గా గుర్తించారు.
తాజాగా బుధవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు 274 మంది పర్వతారోహకుల టీమ్. అందులో ఇండియాకు చెందిన సందీప్ ఆరే, తులసి రెడ్డి, అజయ్ పాల్ సింగ్ తోపాటు మరో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు నేపాల్ ఎక్స్పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఒక రోజులో అధిక సంఖ్యలో ఎవరెస్ట్ను అధిరోహించిన టీమ్గా కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. అయితే, అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరే కిందకు దిగుతున్న సమయంలో తీవ్రంగా అలసిపోయారని తెలిపారు. వారిని రక్షించేందుకు గైడ్స్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరణించినవారు వేర్వేరు బృందాల్లో సభ్యులు. బుధవారం ఒకరు, గురువారం మరొకరు మృత్యువాత పడ్డారు. ఒకరు దిగుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోగా, మరొకరు బేస్ క్యాంప్కు వచ్చినప్పుడు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వీరికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!









