కిషోర్‌ తిరుమల తాజాగా నితిన్‌తో ఓ ప్రాజెక్ట్‌

- February 07, 2016 , by Maagulf
కిషోర్‌ తిరుమల తాజాగా నితిన్‌తో ఓ ప్రాజెక్ట్‌

'నేను శైలజ' చిత్రంతో దర్శకుడిగా మంచి హిట్‌నందుకున్న కిషోర్‌ తిరుమల తాజాగా నితిన్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేయబోతున్నారు. హీరో రామ్‌ కెరీర్‌లోనే ఓ మంచి ఎంటర్‌ టైనర్‌గానే కాకుండా అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా 'నేను శైలజ' నిలిచింది. 'ఇష్క్', గుండెజారి గల్లంతయ్యిందే' వంటి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్లతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్ అందుకున్న నితిన్‌ హీరోగా, కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై నికితా రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నారు.నితిన్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో 'అ.. ఆ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పూర్తయిన తర్వాత కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com