రాముడిగా ప్రభాస్ పర్ఫెక్ట్: రాజమౌళి
- August 25, 2020
ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ మూడు భారీ సినిమాలు చేస్తున్నారు. మూడూ పాన్ ఇండియా చిత్రాలు. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న చిత్రాలివి. అందులో `రాధేశ్యామ్` ప్రస్తుతం తెరకెక్కుతుండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ చేయబోతున్నాడు. దీంతోపాటు అందరిని సర్ప్రైజ్ చేస్తూ గత వారం `ఆదిపురుష్` పేరుతో ఓ పౌరాణిక ప్రాజెక్ట్ ని ప్రభాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రాముడిపై ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు.
తాజాగా `ఆదిపురుష్` ప్రాజెక్ట్ పై దర్శకుధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి అందరికంటే ముందు తనకే తెలుసన్నారు. ఆయన చెబుతూ, `ఆదిపురుష్` చిత్ర పోస్టర్ని అందరికంటే ముందే చూశా. అద్భుతంగా ఉంది. రాముడి పాత్రకి ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్, ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. ఈ సమయంలో రాముడిపై సినిమా తీయడం అభినందనీయం` అని చెప్పారు.
`దేశం మొత్తం రాముడి గురించి చర్చ జరుగుతుండగా, ఆయనపై సినిమా వస్తే దానికి మరింత క్రేజ్ వస్తుంది. అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచుతుంది. సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. విజువల్ వండర్గా ఈ చిత్రం ఉండబోతుందని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఆయన `ఆర్ ఆర్ ఆర్` పేరుతో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్తో మల్టీస్టారర్గా తెరకెక్కుతుంది. ఇది కూడా గ్రాండియర్గా రూపుదిద్దుకుంటోంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







