అబుధాబిలో 520 బస్సుల్లో ఇంటర్నెట్‌ ఉచితం

- August 25, 2020 , by Maagulf
అబుధాబిలో 520 బస్సుల్లో ఇంటర్నెట్‌ ఉచితం

అబుధాబిలో 520 బస్సుల్లో ప్రయాణించేవారికి ఉచిత ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుంది. ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌ (ఐటిసి) ఈ మేరకు తొలి ఫేజ్‌ ప్రాజెక్టుని పూర్తి చేసింది. అన్ని పబ్లిక్‌ బస్సుల్లోనూ వైఫై ద్వారా ఇంటర్నెట్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. తొలి ఫేజ్‌లో మొత్తం 520 బస్సుల్లో 410 అబుదాబీ సిటీలోనూ, మరో 110 బస్సులు అల్‌ అయిన్‌ సిటీలోనూ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని పొందుతున్నాయి. ‘డు’ సంస్థతో ఐటిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వినియోగం పెంచేలా తెచ్చిన మార్పుల్లో ఇదీ ఓ భాగం. బస్‌ షెల్టర్లు అలాగే మెయిన్‌ బస్టాండ్లలోనూ వైఫై అందుబాటులో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com