కోవిడ్ మరణాలపై అసత్య ప్రచారం..యూఏఈలో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- August 26, 2020
యూఏఈ: కరోనా మహమ్మారికి సంబంధించి ప్రజలను భయబ్రాంతులు చేసేలా ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినా సహించేది లేదని యూఏఈ హెచ్చరించింది. కోవిడ్ మరణాలకు సంబంధించి యూఏఈలోని ఓ ఛానెల్ ప్రసారమైన వార్తపై యూఏఈ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోహాలు సృష్టించేలా వార్త కథనాలను ప్రసారం చేసిన సదరు ఛానెల్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కోవిడ్ 19 వల్లే ఓ కుటుంబం చనిపోయినట్లు ప్రసారమైన వార్త పూర్తి నిరాధారణమైనది, అసత్యాలతో కట్టుకథలను ప్రసారం చేశారన్నది ప్రాసిక్యూషన్ వాదన. అసత్య ప్రచారం చేసిన వార్త కథనం వెనక అసలు నిజానిజాలు ఎంటో, కథనాల వెనక ఎవరెవరు ఉన్నారో వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోందని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోవిడ్ 19కి సంబంధించి ఏ రూపంలో అసత్య ప్రచారం జరిగినా అందుకు బాధ్యులైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







