కోవిడ్ మరణాలపై అసత్య ప్రచారం..యూఏఈలో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- August 26, 2020
యూఏఈ: కరోనా మహమ్మారికి సంబంధించి ప్రజలను భయబ్రాంతులు చేసేలా ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినా సహించేది లేదని యూఏఈ హెచ్చరించింది. కోవిడ్ మరణాలకు సంబంధించి యూఏఈలోని ఓ ఛానెల్ ప్రసారమైన వార్తపై యూఏఈ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోహాలు సృష్టించేలా వార్త కథనాలను ప్రసారం చేసిన సదరు ఛానెల్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కోవిడ్ 19 వల్లే ఓ కుటుంబం చనిపోయినట్లు ప్రసారమైన వార్త పూర్తి నిరాధారణమైనది, అసత్యాలతో కట్టుకథలను ప్రసారం చేశారన్నది ప్రాసిక్యూషన్ వాదన. అసత్య ప్రచారం చేసిన వార్త కథనం వెనక అసలు నిజానిజాలు ఎంటో, కథనాల వెనక ఎవరెవరు ఉన్నారో వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోందని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోవిడ్ 19కి సంబంధించి ఏ రూపంలో అసత్య ప్రచారం జరిగినా అందుకు బాధ్యులైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







