ట్రాఫిక్ పాయింట్స్ సిస్టమ్ నేటి నుంచి అమలు
- February 08, 2016
బహ్రెయిన్లో నేటినుంచి న్యూ పాయింట్స్ సిస్టమ్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి అమల్లోకి వచ్చింది. అధికారిక వర్గాలు దీనిపై నిన్ననే స్పష్టమైన ప్రకటన చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదనీ, కఠిన చర్యలు తప్పవు గనుక ప్రతి ఒక్కరూ రోడ్లపై బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ షేక్ నాజర్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా చెప్పారు. ఏడాది కాలానికిగాను అంటే 365 రోజులకు నిబంధనల ఉల్లంఘన పాయింట్లు 20గా నిర్ణయించారు. ఈ పాయింట్లను ఎవరైనా అధిగమిస్తే, అలాంటివారి లైసెన్స్ రద్దు చేయబడుతుంది. తొలి ఉల్లంఘన నుంచే కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. తొలిసారి 20 పాయింట్లను అధిగమించిన తర్వాత 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. రెండోసారి కూడా 20 పాయింట్లను దాటేసినట్లయితే 6 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం, వాహనానికి సంబంధించినది కాకుండా వేరే లైసెన్స్తో ఏదైనా వాహనాన్ని నడపడం, తప్పు పద్ధతిలో ఓవర్టేకింగ్ చేయడం, ఒకరు లేదా అంతకు మించిన వ్యక్తులను రోడ్డు ప్రమాదంలో గాయపర్చడం, అధికారిక మరియు అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోవడం లాంటి నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, పలు రకాలుగా పాయింట్లను లెక్కిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







