హైదరాబాద్ లో డాక్టర్స్ మధ్య కాల్పులు
- February 08, 2016
హైదరాబాద్ హిమాయత్నగర్లో కాల్పుల కలకలం రేగింది. స్ట్రీట్ నెం.6లో ఓ కారులో కాల్పులు జరిగాయి. వ్యాపార భాగస్వామ్యంలో ముగ్గురు డాక్టర్ల మధ్య వివాదం నెలకొనడం దీనికి కారణమైందని సమాచారం. ఒకే కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు డాక్టర్ల మధ్య మాటామాటా పెరగడంతో ఉదయ్కుమార్ అనే డాక్టర్పై శివకుమార్ అనే మరో డాక్టర్ కాల్పులు జరిపాడు. దీంతో చెవి పక్కనుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఉదయ్కుమార్, శశికుమార్లు ఇద్దరూ వైద్యులే కావడం విశేషం.
ఆస్పత్రి లావాదేవీలకు సంబంధించి వీరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. హిమాయత్నగర్ వీధి నెం.6లోని రాజా రెసిడెన్సీ లో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వైద్యులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







