ఏ.పి‌లో కొత్తగా 10,526 కరోనా పాజిటివ్

- August 28, 2020 , by Maagulf
ఏ.పి‌లో  కొత్తగా 10,526 కరోనా పాజిటివ్

అమరావతి:ఏ.పి‌లో గడిచిన 24 గంటల్లో 61,331 మందికి పరీక్షలు నిర్వహించగా..మొత్తం పరీక్షల సంఖ్య 35,41,321కి చేరింది. శుక్రవారం నిర్వహించి పరీక్షల్లో 10,526 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,00,721కి పెరిగింది. తాజాగా వైరస్‌ బారినపడి 81 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 8,463 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,03,711 మందికి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com