శబరిమల అంశంలో సుప్రీం జోక్యం అభ్యంతరకరం : రాజీవ్ చంద్రశేఖర్
- February 08, 2016
కేరళలోని ప్రఖ్యాత శబరిమల దేవాలయంలో మహిళలకు ప్రవేశం కల్పించే అంశంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే చర్య అభ్యంతరకరమని రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ప్రాచీన హిందూ సంప్రదాయాలు, విలువలను గౌరవించాలని కోరారు. 22 ఏళ్లుగా అంతరాయం లేకుండా శబరిమలను దర్శిస్తున్న ఒక భక్తుడిగా.. పూర్వకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలు, ఆచారాల్లో సుప్రీం కోర్టు జోక్యాన్ని అభ్యంతరకరంగా భావిస్తున్నట్లు ఎంపీ చంద్రశేఖర్ ప్రకటించారు.
ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జనవరి 11న సుప్రీం కోర్టు విచారించింది. రుతుక్రమంలో ఉన్న మహిళలను ఆలయం ప్రవేశం చేయకుండా నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. మహిళలకు ఎందుకు ఆలయ ప్రవేశం కల్పించడం లేదనే ప్రశ్నకు స్పందించిన ఎంపీ చంద్రశేకర్... చాలా సందర్భాల్లో పూర్వకాలపు సంప్రదాయాలు, ఆచారాలు నవీన పద్ధతులు, పరీక్షలను అంగీకరించవని.. వాటిని గౌరవించాలని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









