ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ
- September 02, 2020
అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 10వేల 392 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపిలో మొత్తం కేసులు సంఖ్య 4లక్షల 55వేల 531కి చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో 72మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 4వేల 125 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 48వేల 330 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. లక్షా 3వేల 76 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఒక్కరోజులోనే అత్యధికంగా 11మంది కోవిడ్ బారిన పడి మృత్యువాతపడ్డారు. చిత్తూరులో 10మంది, పశ్చిమగోదావరిలో 9, ప్రకాశం జిల్లాలో 8మంది మృతిచెందారు. ఇక కృష్ణా, విశాఖ జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









