ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ
- September 02, 2020
అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 10వేల 392 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపిలో మొత్తం కేసులు సంఖ్య 4లక్షల 55వేల 531కి చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో 72మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 4వేల 125 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 48వేల 330 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. లక్షా 3వేల 76 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఒక్కరోజులోనే అత్యధికంగా 11మంది కోవిడ్ బారిన పడి మృత్యువాతపడ్డారు. చిత్తూరులో 10మంది, పశ్చిమగోదావరిలో 9, ప్రకాశం జిల్లాలో 8మంది మృతిచెందారు. ఇక కృష్ణా, విశాఖ జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







