ఏజెంట్ చేతిలో మోసపోయిన 14 మంది భారతీయ కార్మికులు
- February 09, 2016
14 మంది భారతీయ వలస కార్మికులు ఏజెంట్ చేతిలో మోసపోయారు. మంచి జీతాలు, మంచి ఉద్యోగాలు అని చెప్పి బహ్రెయిన్కి 14 మందిని పంపించారు ఇండియాలో ఏజెంట్లు. అయితే బహ్రెయిన్ వచ్చాక, తాము ఆశించినదానికన్నా తక్కువ జీతాలకు పని చేయాల్సి వస్తోందని 14 మంది భారతీయ కార్మికులు వాపోతున్నారు. పైగా యజమాని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ, అదనపు సమయం పని చేయించుకుని, వేతనం చెల్లించడంలేదని ఆరోపించారు. వీరిలో ఎక్కువమంది డ్రైవర్లు మరియు మేసన్స్గా ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నారు. యజమాని సరైన జీతాలు ఇస్తే తిరిగి స్వదేశానికి వెళ్ళిపోతామని బాధితులు చెప్పారు. వీరంతా ఇండియన్ ఎంబసీని కూడా సంప్రదించడం జరిగింది. తమకు 100 నుంచి 120 బహ్రెయినీ దినార్స్ వరకూ జీతాలు చెల్లిస్తారని చెప్పారనీ, ఇక్కడ 75 నుంచి 100 బహ్రెయినీ దినార్స్ మాత్రమే చెల్లిస్తున్నారనీ, కంపెనీ తమ పాస్పోర్టులను తీసేసుకుందని ఎంబసీకి ఫిర్యాదు చేసిన బాధితులు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







