మరిన్ని మహమ్మారులకు సిద్ధంగా ఉండండి:WHO
- September 08, 2020
జెనీవా:కోవిడ్-19 తోనే ప్రపంచం కకావికలం అవుతుంటే… ఇదేం చిట్టచివరి మహమ్మారి కాదనీ.. మున్ముందు ఇంతకంటే భయంకరమైన వైరస్ రావచ్చుననీ ప్రపంచ ఆరోగ్య సంస్థ భయపెట్టే మాటలు చెబుతోంది.. ఇదేం చివరి వైరస్ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ ఘాటైన హెచ్చరిక చేశారు. ప్రపంచం మరో వైరస్కు రెడీగా ఉంటే మంచిదన్న సలహా కూడా ఇచ్చారు.. ప్రపంచదేశాలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి.. మరిన్ని నిధులు కేటాయిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన! కరోనాను కంట్రోల్ చేసి సంతృప్తి చెందితే సరిపోదని, ఇంతకంటే ప్రాణాంతక మహమ్మారులు వచ్చే అవకాశం ఉందని ఘెబ్రేయేసన్ అన్నారు. కరోనాకు ముందు కూడా చాలా వైరస్లు భూమిని అతలాకుతలం చేశాయని, కరోనా తర్వాత కూడా ఆ పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చారు.. ఈ వాస్తవాన్ని ప్రజలంతా తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.. రాబోయే కాలంలో ఇంతకంటే భయంకరమైన వైరస్ వస్తే దాన్ని కూడా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటీ ఈ అనుభవం సరికొత్త పాఠాలు నేర్పిందని, ఇకనుంచైనా వైరస్ నిరోధం కోసం నిధులు సమకూర్చుకోవడం మంచిదని ప్రపంచ దేశాలకు హితవు చెప్పారు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









