మరిన్ని మహమ్మారులకు సిద్ధంగా ఉండండి:WHO
- September 08, 2020
జెనీవా:కోవిడ్-19 తోనే ప్రపంచం కకావికలం అవుతుంటే… ఇదేం చిట్టచివరి మహమ్మారి కాదనీ.. మున్ముందు ఇంతకంటే భయంకరమైన వైరస్ రావచ్చుననీ ప్రపంచ ఆరోగ్య సంస్థ భయపెట్టే మాటలు చెబుతోంది.. ఇదేం చివరి వైరస్ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ ఘాటైన హెచ్చరిక చేశారు. ప్రపంచం మరో వైరస్కు రెడీగా ఉంటే మంచిదన్న సలహా కూడా ఇచ్చారు.. ప్రపంచదేశాలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి.. మరిన్ని నిధులు కేటాయిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన! కరోనాను కంట్రోల్ చేసి సంతృప్తి చెందితే సరిపోదని, ఇంతకంటే ప్రాణాంతక మహమ్మారులు వచ్చే అవకాశం ఉందని ఘెబ్రేయేసన్ అన్నారు. కరోనాకు ముందు కూడా చాలా వైరస్లు భూమిని అతలాకుతలం చేశాయని, కరోనా తర్వాత కూడా ఆ పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చారు.. ఈ వాస్తవాన్ని ప్రజలంతా తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.. రాబోయే కాలంలో ఇంతకంటే భయంకరమైన వైరస్ వస్తే దాన్ని కూడా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటీ ఈ అనుభవం సరికొత్త పాఠాలు నేర్పిందని, ఇకనుంచైనా వైరస్ నిరోధం కోసం నిధులు సమకూర్చుకోవడం మంచిదని ప్రపంచ దేశాలకు హితవు చెప్పారు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







