సాఫ్ట్ వేర్ నుండి చిత్ర దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న లేడి డైరెక్టర్ దీపిక
- September 10, 2020
హైదరాబాద్:జాంబీ వైరస్ మీద తెలుగులో మొదటగా సినిమా తీస్తున్న మహిళా దర్శకురాలు దీపిక. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే దీపిక సినిమా మేకింగ్ పట్ల ఆసక్తితో జాంబీస్ వైరస్ మీద జీ జాంబీ సినిమా చేయడం జరిగింది. ఆర్యన్ గౌర, దివ్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల నిర్మాత రాజ్ కందుకూరి గారు విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ సందర్భంగా దర్శకురాలు దీపిక మాట్లాడుతూ....
జీవితం అనేది ఒకటే ఉంటుంది, మనం సాధించాలి అనుకున్నది ఎంత కష్టమైన మనం దక్కించుకుని తీరాలి అది అబ్బాయి అయినా అమ్మాయి అయిన. నేను దర్శకత్వం వైపు అడుగులు వేయాలని అనుకోని సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి దర్శకత్వం వహించాను. జీ జాంబీ సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. మేము కష్టపడిన దానికి ప్రేక్షకులు మంచి ఫలితం ఇస్తారని భావిస్తున్నాము. ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఎన్నో హారర్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మా సినిమాకు పని చేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థియేటర్స్ లో విడుదలై మా సినిమా కచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడుతోంది భావిస్తున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







