సాఫ్ట్ వేర్ నుండి చిత్ర దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న లేడి డైరెక్టర్ దీపిక
- September 10, 2020
హైదరాబాద్:జాంబీ వైరస్ మీద తెలుగులో మొదటగా సినిమా తీస్తున్న మహిళా దర్శకురాలు దీపిక. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే దీపిక సినిమా మేకింగ్ పట్ల ఆసక్తితో జాంబీస్ వైరస్ మీద జీ జాంబీ సినిమా చేయడం జరిగింది. ఆర్యన్ గౌర, దివ్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల నిర్మాత రాజ్ కందుకూరి గారు విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ సందర్భంగా దర్శకురాలు దీపిక మాట్లాడుతూ....
జీవితం అనేది ఒకటే ఉంటుంది, మనం సాధించాలి అనుకున్నది ఎంత కష్టమైన మనం దక్కించుకుని తీరాలి అది అబ్బాయి అయినా అమ్మాయి అయిన. నేను దర్శకత్వం వైపు అడుగులు వేయాలని అనుకోని సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి దర్శకత్వం వహించాను. జీ జాంబీ సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. మేము కష్టపడిన దానికి ప్రేక్షకులు మంచి ఫలితం ఇస్తారని భావిస్తున్నాము. ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఎన్నో హారర్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మా సినిమాకు పని చేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థియేటర్స్ లో విడుదలై మా సినిమా కచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడుతోంది భావిస్తున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







