విమాన టికెట్‌ రద్దు చేసుకుంటే గరిష్టంగా వసూలు

- February 10, 2016 , by Maagulf
విమాన టికెట్‌ రద్దు చేసుకుంటే గరిష్టంగా వసూలు


దేశీయ ప్రయాణానికి విమాన టికెట్‌ రద్దు చేసుకుంటే, వసూలు చేసే రుసుంను రూ.500 మేర పెంచుతూ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఆదేశాలు జారీచేసింది. ఈనెల 16 నుంచి సవరించిన రుసుములు వసూలు చేస్తామని తెలిపింది. ముందుగా బుక్‌ చేసుకుని, ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే, గరిష్టంగా రూ.2,000 వరకు వసూలు చేస్తారు. ఇప్పటివరకు ఇది రూ.1,500గా ఉంది. ఈ వివరాలను ట్రావెల్‌ ఏజెంట్లకు కూడా ఎయిరిండియా తెలిపింది. కాగా, ప్రయాణం రద్దు చేసుకుంటే, వసూలు చేసే రుసుము దేశీయ సంస్థల్లో ఎయిర్‌ ఏషియాదే తక్కువ. ఆ సంస్థ రూ.1,502 వసూలు చేస్తోంది. స్పైస్‌జెట్‌ ఇటీవలే రద్దు రుసుంను రూ.1,800 నుంచి రూ.1,899కి పెంచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com