తెలంగాణా వాసికి షుమారు కోటి రూపాయల జరిమానా మాఫీ చేసిన యూఏఈ
- September 15, 2020
యూఏఈ: ఉద్యోగం కోసం పొట్ట చేత పట్టుకొని వలస వచ్చి ఏజెంట్ చేతిలో మోసపోయి ఎటు పోవాలో దిక్కుతోచక అల్లాడిపోతున్న కార్మికులు ఎందరో ఈ గల్ఫ్ లో..అటువంటి ఓ సంఘటన తాజాగా జరిగింది.
2007 లో హైదరాబాద్కు చెందిన లెండి పోతుగోండ మేడి విజిట్ వీసాపై యూఏఈ రావటం జరిగింది. అతన్ని తీసుకువచ్చిన ఏజెంట్ తనను వివిడిచిపెట్టి, తన వద్ద నుండి పాస్పోర్ట్ తీసేసుకొని మోసం చేసినట్టు గ్రహించాడు పోతుగోండ మేడి.దిక్కుతోచని స్థితిలో పడ్డ పోతుగొండ ఎదో చైనా చితకా పనులు చేసుకుంటే పొట్టపోసుకున్నాడు.ఇలా సంవత్సరాలు యూఏఈ లో అక్రమంగా నివిసిస్తున్నాడు.తన ఓవర్స్టే కి గాను దాదాపు అర మిలియన్ దిర్హామ్ల (షుమారు కోటి రూపాయాలు) జరిమానా బారినపడ్డాడు.
వీసా ఉల్లంఘించినవారికి ఓవర్స్టే జరిమానాల నుండి మినహాయింపు ఇవ్వడానికి యూఏఈ ప్రభుత్వం చేపట్టిన 'ఆమ్నెస్టీ' పధకం ద్వారా దుబాయ్లోని భారత కాన్సులేట్ సహాయం కోరిన తరువాత పోతుగోండ ను స్వదేశానికి పంపేందుకు మార్గం సుగమం అయింది అని ఇండియన్ కాన్సులేట్ లోని లేబర్ కాన్సులర్ జితేంద్ర నేగి మాగల్ఫ్ న్యూస్ కు చెప్పారు.
"అయితే, పోతుగోండ భారతీయ పౌరుడని నిరూపించడానికి అధికారిక పత్రం లేనందున కాన్సులేట్ వెంటనే అతనికి సహాయం చేయడం కష్టమైంది. పోతుగోండ కుటుంబాన్ని కనిపెట్టడానికి మేము హైదరాబాద్ లోని ఒక సామాజిక సహాయం అందించే ఓ సంస్థను సహాయం కోరటం జరిగింది. హైదరాబాద్ లోని టి.ఆర్ శ్రీనివాస్(సోషల్ వర్కర్ మరియు బీజేపీ జి.సి.సి,చైర్మన్) మద్దతుతో, పోతుగోండ పాత రేషన్ కార్డు మరియు ఎన్నికల ఐడి కార్డు యొక్క కాపీలను అతని స్వస్థలం నుండి పొందగలిగాము.దీంతో అతను భారతీయుడని అని నిరూపించే ఆధారాలు లభించినందున వెంటనే తన జరిమానాను మాఫీ చేసి తాను స్వస్థలానికి వెళ్లేందుకు టికెట్ కూడా అందించటం జరిగింది." అని జితేంద్ర నేగి మాగల్ఫ్ న్యూస్ కు వివరించారు.
పోతుగోండ వివరాలు అందించిన బీజేపీ జి.సి.సి,చైర్మన్ టి. ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ "ఇక్కడ ఒక సమస్య ఎదురయింది.పోతుగోండ, నాలుగు వేర్వేరు పత్రాలకు తన పేరును నాలుగు రకాలుగా ఇచ్చాడు. దాన్ని పరిష్కరించడానికి నేను మా ఎంపి (పార్లమెంటు సభ్యుడు) ధర్మపురి అరవింద్ సహాయం తీసుకోవలసి వచ్చింది" అని ఫోన్ లో వివరించారు.
సోమవారం తన 47 వ పుట్టినరోజు జరుపుకున్నాడు అది కూడా స్వస్థలంలో ఇది తనకు నిజంగా ఒక మరిచిపోలేని 'బర్త్ డే గిఫ్ట్' అని లెండి పోతుగోండ మేడి తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







