కువైట్:ఇక నుంచి డిజిట్ సివిల్ ఐడీలతో విమాన ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్
- September 18, 2020
కువైట్ సిటీ:కువైట్ నుంచి వెళ్లాలన్నా..కువైట్ రావాలన్నా..సరైన డాక్యుమెంట్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి గుడ్ న్యూస్ అందించింది కువైట్ ప్రభుత్వం. ఇక నుంచి డిజిటల్ సివిల్ ఐడీలను కూడా ట్రావెల్ డాక్యుమెంట్లుగా ఆమోదించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కువైట్ లోని అన్ని పోర్టులు, విమానాశ్రయాలకు అలాగే కువైట్ కు సర్వీసులు నడిపే ఎయిర్ లైన్స్ కు సమాచారం అందించింది. లాక్ డౌన్ తర్వాత చాలా మంది ప్రవాసీయులు సరైన డాక్యుమెంట్లు లేక విమాన ప్రయాణ అనుమతికి ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ఎంబసీల నుంచి ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు తీసుకొని ప్రయాణం చేయవచ్చని వెసులు బాటు కలిపించిన కువైట్ ప్రభుత్వం..తాజాగా విదేశీ ప్రయాణాలకు సంబంధించి నిబంధనలను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కువైట్ అధికారిక మొబైల్ యాప్ లోని సివిల్ ఐడీని చూపించి విదేశీ ప్రయాణం చేయొచ్చని స్పష్టం చేసింది. అలాగే ఇతర దేశాల నుంచి కువైట్ కు రావొచ్చని కూడా క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కువైట్ లో ఉన్న అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం అందించారు. అలాగే విదేశాల్లో ఉన్న కువైట్ రాయబార కార్యాలయాలకు కూడా సివిల్ ఐడీలను ట్రావెల్ డాక్యుమెంట్లుగా అనుమతించాలని ఆదేశించింది. కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రవాసీయుల ప్రయాణం మరింత సులభం కానుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







