కోవిడ్ వ్యాప్తి నియంత్రణపై మరింత ఫోకస్ చేస్తున్న దుబాయ్..
- September 18, 2020
దుబాయ్:కోవిడ్ 19ను సమర్ధవంతంగా అరికట్టేందుకు అన్ని విధాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు దుబాయ్ అధికారులు. దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను అమలు చేస్తున్న నేపథ్యంలో మాల్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ సూచనల మేరకు మాల్స్, వాణిజ్య కేంద్రాలు కోవిడ్ నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నాయా? లేదా? అనేది ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా దుబాయ్ లోని పలు మాల్స్, రిటైల్ షాపులలో తనిఖీలు చేపట్టిన అధికారులు..కోవిడ్ నిబంధనలు పాటించని 7 షాపుల నిర్వాహకులకు ఫైన్ విధించారు. మాస్కులు, గ్లౌజులు ధరించకుండా షాపులు నిర్వహిస్తున్న కారణంగా జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే రెండు షాపుల్లో భౌతిక దూరం అమలు నిబంధనను ఉల్లంఘించినట్లు గుర్తించామని..ఆ షాపుల నిర్వాహకులను హెచ్చరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







