ట్యాక్సీ మీటర్లను వ్యతిరేకిస్తున్న 'ఆరెంజ్' డ్రైవర్స్
- February 11, 2016
ఒమన్లో ట్యాక్సీలకు మీటర్ల వినియోగంపై దుమారం చెలరేగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆరెంజ్ ట్యాక్సీ డ్రైవర్స్ వ్యతిరేకించారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్తో జరిగిన సమావేశంలో ట్యాక్సీ ప్రతినిథులు ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ట్యాక్సీలకు మీటర్లను బిగించడం ద్వారా వినియోగదారులకు ఛార్జీల మోత మోగిపోతుందనీ, అది తమ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని 500 ఆరెంజ్ ట్యాక్సీ డ్రైవర్స్ తరఫున అధికార ప్రతినిథిగా వచ్చిన సులేమాన్ అల్ జర్దానీ చెప్పారు. అయితే ట్యాక్సీల్లో ప్రయాణించేవారు, ట్యాక్సీ డ్రైవర్లు అదనంగా సొమ్ములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు చేయడంతో ఈ మీటర్ ప్రతిపాదన చేయాల్సి వచ్చిందని రాయల్ ఒమన్ పోలీసులు అలాగే మంత్రివర్గ అధికారులు వెల్లడించారు. అయితే ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చినా, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదనీ, వద్దంటున్న మీటర్ విధానాన్ని తమకు ఇష్టం లేకపోయినా ఎలా అమలు చేయాలని అనుకుంటున్నారని ట్యాక్సీ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









