ఖతార్:ఐబీపీసీ ఉపాధ్యక్షుడు సుమిత్ మల్హోత్రకు ఆత్మీయ వీడ్కోలు
- September 28, 2020
దోహా:ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం ఆధర్వంలో ఉండే ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫిషినల్ కౌన్సిల్-ఐబీపీసీ తమ ఉపాధ్యక్షుడు సుమిత్ మల్హోత్రకు ఆత్మీయ వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా ఐబీపీసీ అభివృద్ధికి ఇండియన్ కమ్యూనిటీకి సుమిత్ మల్హోత్ర చేసిన సేవలను కొనియాడిన ఐబీపీసీ అధ్యక్షుడు అజిమ్ అబ్బాస్ సుమిత్ మల్హోత్రకు ప్రశంస పత్రాన్ని అందించారు. పదేళ్లుగా ఖతార్ లో ఉంటున్న సుమిత్ గోల్స్ 101 సీఈవోగా, జేఎంఎస్ ఖతార్ జనరల్ మేనేజర్ గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించి మంచి గుర్తింపు పొందారు. అయన కార్యదర్శత, ప్రతిభా పాటవాలతో ఐబీపీసీ ఎంతగానో ప్రయోజనం పొందిందని, ఖతార్, ఇండియా మార్కెట్ పై ఆయనకు ఉన్న అపారమైన అవగాహన భారత సమాజంతో వ్యవహారాలు మరింత మెరుగయ్యాయని అన్నారు. ఆయన తన భవిష్యత్తు బాధ్యాతలను మరింత సమర్ధవంతంగా నిర్వహించి..మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ఐబీపీసీ కార్యవర్గం ఆత్మీయ వీడ్కోలు పలికింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







