మస్కట్:నవంబర్ 15న మసీదులు, ప్రార్ధనామందిరాల పున:ప్రారంభంపై నిర్ణయం
- September 29, 2020
మస్కట్:అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కొన్ని సెక్టార్లలో కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్న ఒమన్ ప్రభుత్వం..ప్రార్ధనామందిరాల విషయంలో వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. ప్రజల ఆరోగ్య సంరక్షణకే తమ ప్రధాన్యమని చెబుతున్న ప్రభుత్వం..ఒమన్ లోని మసీదులు, ఇతర ప్రార్ధనా మందిరాల పున:ప్రారంభంపై నవంబర్ 15న తగిన నిర్ణయం తీసుకంటామని స్పష్టత ఇచ్చింది. అయితే..కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..సెప్టెంబర్ 22న జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణమైన పరిస్థితులు ఉంటేనే మసీదులు, ప్రార్ధనా మందిరాలకు అనుమతి ఇస్తామని కూడా వెల్లడించింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రార్ధనామందిరాలకు అనుమతి ఇవ్వటం వల్లే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తాము నమ్ముతున్నామని ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







