మొగలిరేకులు సాగర్ హీరోగా దర్శకుడు రమేష్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్
- October 01, 2020
హైదరాబాద్:అద్భుతమైన చిత్రాలకు కథ, మాటలు అందించిన రచయిత మరియు దర్శకుడు బివిఎస్.రవి మళ్లీ నిర్మాతగా మారనున్నారు, గతంలో సెకండ్ హ్యాండ్ అనే సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమలని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేసిన బీవిఎస్ రవి ఇప్పుడు రమేశ్ ను దర్శకుడిగా లాంఛ్ చేస్తున్నారు.
మొగలిరేకులు సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు సాగర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఎప్పటినుంచి బివిఎస్ రవికి, నటుడు సాగర్ కి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగర్ ని హీరోగా మరోమారు ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నారు రవి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ప్రాధాన్యం ఉండబోతోంది. ఇంతవరకు తెలుగు చిత్ర సీమలో ఎన్నడు రాని ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమాలో కథనాయక పాత్రని తీర్చిదిద్దుతున్నట్లుగా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు రమేష్ గతంలో గౌతమ్ మీనన్, వైవిఎస్.చౌదరి గార్ల దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమా గురించి మరింత సమాచారం త్వరలో చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలియనుంది. కొత్త కాన్సెప్ట్స్ తో వస్తోన్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తు వస్తున్నారు. అదే తరహాలో బివిఎస్.రవి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాను స్వయంగా ఒక రచయిత కావున ఈ సినిమా కథ, కథనాలు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







