సౌదీ ఎడ్యుకేషన్‌ క్యాంప్‌లో దాడి, ఆరుగురి మృతి

- February 12, 2016 , by Maagulf
సౌదీ ఎడ్యుకేషన్‌ క్యాంప్‌లో దాడి, ఆరుగురి మృతి

సౌదీ అరేబియాలోని ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యాలయంలో ఓ వ్యక్తి ఆరుగురు ఉద్యోగులను హతమార్చాడు. ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఈ దాడిని అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించింది. ఓ టీచర్‌, ఆరుగురు సహచరుల్ని చంపేసినట్లుగా తెలియవస్తోంది. మరో ఇద్దరు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలయ్యారు. అద్‌ దయర్‌లోని రిమోట్‌ కమ్యూనిటీలో ఈ దాడి జరిగింది. ఎమెని బోర్డర్‌కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. దాడికి పాల్పడింది ఎవరు? అన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. టీచర్ల సహోద్యోగి అని కొన్ని వార్తలు వస్తుండగా, బయట నుంచి వచ్చిన వ్యక్తి దారుణానికి ఒడిగట్టినట్లుగా ఇంకొన్ని వార్తలు వస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com