విశాఖ స్మార్ట్‌సిటీ ప్రణాళికకు అమెరికా సహకారం

- February 12, 2016 , by Maagulf
విశాఖ స్మార్ట్‌సిటీ ప్రణాళికకు  అమెరికా సహకారం

విశాఖ ఆకర్షణీయ నగర బృహత్‌ ప్రణాళిక తయారీకి సహకారం అందిస్తున్నట్లు భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ తెలిపారు. స్మార్ట్‌సిటీ కోసం విశాఖకు రూ.10కోట్లు కేటాయించినట్లు చెప్పారు. భారత్‌అమెరికా మధ్య సంబంధాల్లో గతేడాది కీలక ముందడుగు పడిందని... ఈ బంధం ఈ ఏడాది మరింత బలోపేతం చేస్తామన్నారు. రక్షణ రంగంలో సహకారానికి మరింత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో భారత్‌అమెరికా మధ్య వాణిజ్యాన్ని విస్తృతం చేయనున్నట్లు వర్మ చెప్పారు.ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. అమెరికా ఎగుమతి, దిగుమతుల్లో భారత్‌ వాటా కేవలం 2 శాతం మాత్రమే ఉందని... విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. భారత విద్యార్థులను అమెరికాలో ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని... ప్రవేశాల్లో రెండంచెల విధానం గుర్తించలేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారని వర్మ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com