భారత్ లో తగ్గిన కరోనా కేసులు

- October 06, 2020 , by Maagulf
భారత్ లో తగ్గిన కరోనా కేసులు

న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.. వరుసగా కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన చెందుతున్న సమయంలో.. గుడ్‌న్యూస్‌ చెబుతూ.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా కాస్త తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 61,267 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 884 మంది మృతిచెందారు. దీంతో.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,85,083కు చేరుకున్నాయి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,19,023 యాక్టివ్‌ కేసులు ఉండగా... 56,62,491 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 1,03,569 మంది మృతిచెందారు. మరోవైపు.. సోమవారం రోజు 10,89,403 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.. దీంతో.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 8,10,71,797కు చేరినట్టు పేర్కొంది ICMR. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com