మస్కట్ నుంచి భారత్ లోని 6 నగరాలకు ఇండిగో విమాన సర్వీసులు

- October 06, 2020 , by Maagulf
మస్కట్ నుంచి భారత్ లోని 6 నగరాలకు ఇండిగో విమాన సర్వీసులు

మస్కట్:ఒమన్ నుంచి భారత్ కు విమాన సర్వీసులను నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే..ఒమన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన మేరకు మస్కట్ నుంచి భారత్ లోని 6 నగరాలకు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. ఒమన్-భారత్ మధ్య కుదిరిన బబుల్ అగ్రీమెంట్ అక్టోబర్ 1 నుంచి రెండు నెలలు అమలులో ఉంటుంది. దీంతో విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఇండిగో ఆక్టోబర్ 7 నుంచి సర్వీసులను స్టార్ట్ చేయనుంది. మస్కట్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, ముంబై, చెన్నై, కొచ్చి నగరాలకు విమానాలు నడపనుంది. ఒమనీయులతో పాటు ప్రవాసీయులు ఇండియా నుంచి మస్కట్ కు వెళ్లొచ్చు. అయితే..ఒమన్ జారీ చేసిన కోవిడ్ మార్గనిర్దేశకాల మేరకు ప్రతి ఒక్కరు మస్కట్ లో ల్యాండ్ అవగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే 30 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందేలా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మస్కట్ నుంచి ఇండియాకు కేవలం ప్రవాస భారతీయులను, ఒమన్ లో చిక్కుకుపోయిన ఇండియన్లను మాత్రమే అనుమతిస్తారు. అయితే..హోమంత్రిత్వ శాఖ పరిధిలో వీసాలు పొందిన ఒమనీయులు, దౌత్య కార్యాలయ అధికారులకు మినహాయింపు ఇచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com