1,30,000 దిర్హామ్ల విజిట్ వీసా స్కామ్
- February 12, 2016
వీసా స్కామ్లో ఇద్దరు పాకిస్తానీలపై నేరం నిరూపితమయ్యింది. 25 మందికి వీసాలను మంజూరు చేస్తామని మోసం చేసిన కేసులో ఇద్దరిని న్యాయస్థానం దోషులుగా తీర్పునిచ్చింది. వారికి విధించబోయే శిక్షపై మార్చ్ 9న నిర్ణయం వెలువడుతుంది. పాకిస్తానీ సెక్యూరిటీ ఆఫీసర్, తన వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులకు వీసా ఇప్పించేందుకు ఏజెంట్లుగా పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికోసం 1,30,000 ఖర్చవుతుందని వారు చెప్పారు. తొలి విడతగా 45,000 దిర్హామ్లు చెల్లించాడు పాకిస్తానీ సెక్యూరిటీ ఆఫీసర్. మిగతా మొత్తం కూడా కొన్నాళ్ళ తర్వాత వారికి చెల్లించడం జరిగింది. వీసాలను కొద్ది రోజులలోనే ఇస్తామని చెప్పి, ఆ తర్వాత నిందితులు తప్పించుకుపోయారు. నిందితులు ఇచ్చిన డాక్యుమెంట్ ఫోర్జరీగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నిర్ధారించింది. ఈ కేసులో పోలీసులు 59 ఏళ్ళ బిజినెస్ మెన్, 23 ఏళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ని ఈ కేసులో అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







