1,30,000 దిర్హామ్‌ల విజిట్‌ వీసా స్కామ్‌

- February 12, 2016 , by Maagulf
1,30,000 దిర్హామ్‌ల విజిట్‌ వీసా స్కామ్‌

వీసా స్కామ్‌లో ఇద్దరు పాకిస్తానీలపై నేరం నిరూపితమయ్యింది. 25 మందికి వీసాలను మంజూరు చేస్తామని మోసం చేసిన కేసులో ఇద్దరిని న్యాయస్థానం దోషులుగా తీర్పునిచ్చింది. వారికి విధించబోయే శిక్షపై మార్చ్‌ 9న నిర్ణయం వెలువడుతుంది. పాకిస్తానీ సెక్యూరిటీ ఆఫీసర్‌, తన వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులకు వీసా ఇప్పించేందుకు ఏజెంట్లుగా పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికోసం 1,30,000 ఖర్చవుతుందని వారు చెప్పారు. తొలి విడతగా 45,000 దిర్హామ్‌లు చెల్లించాడు పాకిస్తానీ సెక్యూరిటీ ఆఫీసర్‌. మిగతా మొత్తం కూడా కొన్నాళ్ళ తర్వాత వారికి చెల్లించడం జరిగింది. వీసాలను కొద్ది రోజులలోనే ఇస్తామని చెప్పి, ఆ తర్వాత నిందితులు తప్పించుకుపోయారు. నిందితులు ఇచ్చిన డాక్యుమెంట్‌ ఫోర్జరీగా మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ నిర్ధారించింది. ఈ కేసులో పోలీసులు 59 ఏళ్ళ బిజినెస్‌ మెన్‌, 23 ఏళ్ళ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ని ఈ కేసులో అరెస్ట్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com