సలాహ్ ప్రాంతాల్లో సముద్ర ముంపు ప్రమాదం
- February 12, 2016
భవిష్యత్తులో ఐదు మీటర్ల మేర సముద్ర మట్టం పెరిగినట్లయితే సలాహ్ ప్రాంతాల్లో చాలావరకు నీటిలో మునిగిపోతాయని ఇటీవల నిర్వహించిన ఓ స్టడీ పేర్కొంది. సియోమాటిక్స్ స్పెలిస్ట్ అమోల్ జి దేశ్ముఖ్ మాట్లాడుతూ, స్టడీ కోసం సలాహ్ ప్రాంతాల్ని పరిశీలించామనీ, చాలా వరకు రిసార్టులు, హోటళ్ళు తీర ప్రాంతంలో నిర్మించబడ్డాయనీ, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు చేపడుతున్న ఈ ప్రాజెక్టులు సునామీ ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటినుంచే అవగాహన పెంచుకోవాలని ఆయన చెప్పారు. ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిస్థితుల్ని అంచనా వేశారు. నేషనల్ సర్వే అథారిటీ ఈ వివరాల్ని అందరికీ అందుబాటులో ఉంచిందని దేశ్ముఖ్ వివరించారు. వరదలు సంభవించినప్పుడు సుల్తానేట్లో డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బందికరంగా మారుతుందనీ, దీని విషయంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవలసి ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







