సలాహ్‌ ప్రాంతాల్లో సముద్ర ముంపు ప్రమాదం

- February 12, 2016 , by Maagulf
సలాహ్‌ ప్రాంతాల్లో సముద్ర ముంపు ప్రమాదం

భవిష్యత్తులో ఐదు మీటర్ల మేర సముద్ర మట్టం పెరిగినట్లయితే సలాహ్‌ ప్రాంతాల్లో చాలావరకు నీటిలో మునిగిపోతాయని ఇటీవల నిర్వహించిన ఓ స్టడీ పేర్కొంది. సియోమాటిక్స్‌ స్పెలిస్ట్‌ అమోల్‌ జి దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ, స్టడీ కోసం సలాహ్‌ ప్రాంతాల్ని పరిశీలించామనీ, చాలా వరకు రిసార్టులు, హోటళ్ళు తీర ప్రాంతంలో నిర్మించబడ్డాయనీ, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు చేపడుతున్న ఈ ప్రాజెక్టులు సునామీ ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటినుంచే అవగాహన పెంచుకోవాలని ఆయన చెప్పారు. ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిస్థితుల్ని అంచనా వేశారు. నేషనల్‌ సర్వే అథారిటీ ఈ వివరాల్ని అందరికీ అందుబాటులో ఉంచిందని దేశ్‌ముఖ్‌ వివరించారు. వరదలు సంభవించినప్పుడు సుల్తానేట్‌లో డ్రైనేజ్‌ సిస్టమ్‌ ఇబ్బందికరంగా మారుతుందనీ, దీని విషయంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవలసి ఉందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com