ఈ సెమెస్టర్ ముగిసే వరకు డిస్టెన్స్ లెర్నింగ్ పొడిగించిన సౌదీ అరేబియా
- October 09, 2020
రియాద్:కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో ఇప్పుడప్పుడే తరగతులను ప్రారంభించేది లేదని స్పష్టత ఇచ్చింది సౌదీ ప్రభుత్వం. ఫస్ట్ సెమిస్టర్ ముగిసే వరకు ఆన్ లైన్ విధానంలోనే పాఠాలు బోధించాలని నిర్ణయించింది. కోవిడ్ 19 కారణంగా ఈ ఏడాది ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆగస్ట్ 30 నుంచి స్కూల్స్ ప్రారంభమైనా.. విద్యాశాఖ ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ నివేదికలకు అనుగుణంగా ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. నేరుగా తరగతులను నిర్వహించే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి ఆరోగ్య శాఖ, విద్యాశాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని గతంలోనే ప్రకటించింది విద్యా మంత్రిత్వ శాఖ. అయితే..ప్రస్తుతం కరోనా వైరస్ ఇంకా నియంత్రణలోకి రాకపోవటంతో ఇప్పుడే నేరుగా తరగతుల నిర్వహించొద్దంటూ వైద్య శాఖ ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వటంతో..ఫస్ట్ సెమిస్టర్ ముగిసే వరకు ఆన్ లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









