ఈ సెమెస్టర్ ముగిసే వరకు డిస్టెన్స్ లెర్నింగ్ పొడిగించిన సౌదీ అరేబియా

- October 09, 2020 , by Maagulf
ఈ సెమెస్టర్ ముగిసే వరకు డిస్టెన్స్ లెర్నింగ్ పొడిగించిన సౌదీ అరేబియా

రియాద్:కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో ఇప్పుడప్పుడే తరగతులను ప్రారంభించేది లేదని స్పష్టత ఇచ్చింది సౌదీ ప్రభుత్వం. ఫస్ట్ సెమిస్టర్ ముగిసే వరకు ఆన్ లైన్ విధానంలోనే పాఠాలు బోధించాలని నిర్ణయించింది. కోవిడ్ 19 కారణంగా ఈ ఏడాది ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆగస్ట్ 30 నుంచి స్కూల్స్ ప్రారంభమైనా.. విద్యాశాఖ ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ నివేదికలకు అనుగుణంగా ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. నేరుగా తరగతులను నిర్వహించే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి ఆరోగ్య శాఖ, విద్యాశాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని గతంలోనే ప్రకటించింది విద్యా మంత్రిత్వ శాఖ. అయితే..ప్రస్తుతం కరోనా వైరస్ ఇంకా నియంత్రణలోకి రాకపోవటంతో ఇప్పుడే నేరుగా తరగతుల నిర్వహించొద్దంటూ వైద్య శాఖ ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వటంతో..ఫస్ట్ సెమిస్టర్ ముగిసే వరకు ఆన్ లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com