భారత్ లో నిన్న ఒక్కరోజే 70,496 కరోనా కేసులు..
- October 09, 2020
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 70,496 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. 964 మంది బాధితులు మృతి చెందారు. 11,68,705 శాంపిల్స్ పరీక్షించగా.. ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే 78,365 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 85.52 శాతానికి చేరింది.
దేశ వ్యాప్తంగా 69,06,161 మందికి కరోనా సోకింది. వారిలో 1,06,490 మంది మృత్యువాతపడ్డారు. 59,06,069 మంది కోలుకున్నారు. ఇంకా 8,93,592 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 8,46, 34,680 మందికి కరోనా పరీక్షలు చేశారు. అత్యధికంగా మహారాష్ట్రలో 14,93,884 మందికి వ్యాధి సోకగా.. 39,430 మంది మరణించారు. ఆ తర్వాత స్థానంలో ఏపీలో 7,39,719 కేసులు బయటపడ్డాయి. వీరిలో 6,128 మంది చనిపోయారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 36,754,006 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1,066,856 మంది ప్రాణాలు కోల్పోయారు. 27,667,693 మంది కోలుకోగా.. 8,019,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!









