భారత్ లో నిన్న ఒక్కరోజే 70,496 కరోనా కేసులు..
- October 09, 2020
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 70,496 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. 964 మంది బాధితులు మృతి చెందారు. 11,68,705 శాంపిల్స్ పరీక్షించగా.. ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే 78,365 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 85.52 శాతానికి చేరింది.
దేశ వ్యాప్తంగా 69,06,161 మందికి కరోనా సోకింది. వారిలో 1,06,490 మంది మృత్యువాతపడ్డారు. 59,06,069 మంది కోలుకున్నారు. ఇంకా 8,93,592 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 8,46, 34,680 మందికి కరోనా పరీక్షలు చేశారు. అత్యధికంగా మహారాష్ట్రలో 14,93,884 మందికి వ్యాధి సోకగా.. 39,430 మంది మరణించారు. ఆ తర్వాత స్థానంలో ఏపీలో 7,39,719 కేసులు బయటపడ్డాయి. వీరిలో 6,128 మంది చనిపోయారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 36,754,006 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1,066,856 మంది ప్రాణాలు కోల్పోయారు. 27,667,693 మంది కోలుకోగా.. 8,019,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..







