పాకిస్థాన్ బుధవారం 100 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది
- February 12, 2016
సెంట్రల్ జైలులో ఖైదీలు, పోలీసులకు మధ్య ఘర్షణ(2011 నాటి ఫొటో) కరాచీ: పెషావర్ సైనిక స్కూల్ పై దాడి అనంతరం ఉగ్రవాదాన్ని అంతమొందిస్తానని ప్రతినబూనిన పాకిస్థాన్ బుధవారం 100 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ జైలు విధ్వంసం కుట్ర, కరాచీలోని మెహ్రం ఎయిర్ బేస్, జిన్నా ఎయిర్ పోర్టులపై దాడులు, కమ్రాలోని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోకి చొరబాటు తదితర కుట్రల్లో పాలుపంచుకున్న ఉగ్రవాదుల అరెస్ట్ ఉగ్రవ్యతిరేక పోరులో కీలక ఘట్టమని, అరెస్టయిన వారిలో అల్- కాయిదా, లష్కరే జంగ్వి, తెహ్రీక్ ఏ తాలిబన్ తదితర సంస్థలకు చెందినవారని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెప్టినెంట్ జనరల్ ఆసిమ్ సలేమ్ బజ్వా తెలిపారు.భారత్ భద్రతా బలగాలకు పట్టుబడి, '1999 కందహార్ హైజాక్' ఉదంతంలో అనూహ్యంగా విడుదలైన అహ్మద్ ఒమర్ సయ్యద్.. ఆ తర్వాతి కాలంలో అల్ కాయిదా చీఫ్ గా ఎదిగాడు. ప్రస్తుతం మరణశిక్షగు గురైన అతను సంధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. గతేడాది ఫిబ్రవరిలో జైలును ధ్వంసం చేసి ఒమర్ ను తమతో తీసుకెళ్లాలని ఉగ్రవాదులు కుట్రపన్నారు. అయితే పోలీసులుల అప్రమత్తతతో ఉగ్రవాదుల వ్యూహం బెడిసికొట్టింది. కరాచీ ఆపరేషన్ గా నామకరణం చేసిన ఉగ్రవాదుల పట్టివేత ఆపరేషన్ లో ఇప్పటివరకు 12 వేల మందిని అరెస్టు చేశామని, 7 వేలకు పైగా దాడులు నిర్వహించామని సలేమ్ బజ్వా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









