కువైట్:NRI నుంచి సలహాలు, సూచనలు కోరిన భారత రాయబార కార్యాలయం
- October 12, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని ప్రవాస భారతీయులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎన్ఆర్ఐలను సలహాలు కోరింది కువైట్ లోని భారత రాయబార కార్యాలయం. దౌత్య సంబంధ అంశాలతో పాటు భారతీయుల సంక్షేమానికి సంబంధించి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని అధికారులు కోరారు. ఇందుకోసం కువైట్ భారత రాయబార కార్యాలయంతో పాటు మూడు పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రత్యేకంగా ఫీడ్ బ్యాక్ పేపర్లను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఇంగ్లీష్ లోనే ఫీడ్ బ్యాక్ పేపర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలోనే మరన్ని భాషల్లో పేపర్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కువైట్ లోని ప్రవాస భారతీయులు పేపర్లలో తమ ఫీడ్ బ్యాక్ కు, సలహాలను రాసి రాయబార కార్యాలయం రిసిప్షన్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలని తెలిపారు. అలాగే పాస్ పోర్ట్ కేంద్రాల్లోనూ బాక్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే [email protected] ద్వారా కూడా ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక









