కువైట్ నూతన అమీర్ తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం

- October 12, 2020 , by Maagulf
కువైట్ నూతన అమీర్ తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం

కువైట్ సిటీ:కువైట్ పర్యటలో ఉన్న భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్...కువైట్ అమీర్ గా బాధ్యతలు స్వీకరించిన షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాతో సమావేశం అయ్యారు. ఇటీవలె కన్నుమూసిన కువైట్ అమీర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా మృతికి విచారం వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి, ప్రధాని పంపిన సంతాప లేఖలను కువైట్ పాలకులకు అందజేశారు. అదేసమయంలో కువైట్ కొత్త అమీర్ గా బాధ్యతలు స్వీకరించిన షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాతో పాటు క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషేల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాకు భారత ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శుభాకాంక్షలు తెలుపారు. ఆ తర్వాత..కువైట్ విద్యుత్, నీరు, చమురు శాఖ మంత్రి డాక్టర్ ఖలీద్ అలీ అల్ ఫదాల్ తో సమావేశమైన ధర్మేంద్ర ప్రదాన్ ద్వైపాక్షిక
సంబంధాలు..చమురు రంగంలో ఇరు దేశాల పరస్పర సహకారంపై మాట్లాడుకున్నారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com