మరణ శిక్ష నిబంధనల్ని సవరించిన ఒమన్
- October 14, 2020
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బబిశ్రీన్ తరీక్, మరణ శిక్షలకు సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ రాయల్ డిక్రీని విడుదల చేశారు. యునానిమిటీ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా క్రిమినల్ కోర్ట్ మరణ శిక్ష విధించకూడదంటూ ఈ డిక్రీ విడుదలయ్యింది. సుల్తాన్ ఆర్డర్ ద్వారా ఏర్పాటైన కమిటీకి సదరు కేసు డాక్యుమెంట్ని సంపాదల్సి వుంటుంది. సుల్తాన్ గ్రాండ్ ముఫ్టి లేదా అసిస్టెంట్ ఈ ప్యానెల్కి నాయకత్వం వహిస్తారు. ఇద్దరు అనుభవంగల సభ్యుల్ని ప్రెసిడెంట్ నియమిస్తారు. షరియా బేస్డ్ ఆపీనియన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు. 60 రోజుల్లోగా కమిటీ తన అభిప్రాయన్ని వెల్లడించకపోతే, ట్రిబ్యునల్ రూల్ కొనసాగుతుంది. యునానిమిటీ లేనిపక్షంలో, మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాల్సి వుంటుంది. అధికారిక గెజిట్లో ఈ సవరణను చేర్చారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









