ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- June 23, 2026
దోహా: ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) లుసైల్ ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. నెట్వర్క్ అంతటా ముఖ్యమైన అభివృద్ధి పనులను చేయడానికి వీలుగా జూన్ 26నుండి జూలై 5 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడానికి మరియు ట్రామ్ నెట్వర్క్ పనితీరును మెరుగుపరచడానికి ఖతార్ రైల్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, రవాణా మంత్రిత్వ శాఖ సమన్వయంతో ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతోందన్నారు.
సేవలు నిలిపివేసిన సమయంలో ప్రయాణీకులకు సేవలు నిరంతరాయంగా కొనసాగేలా లెగ్తైఫియా స్టేషన్ నుండి తర్ఫత్ - సౌత్ స్టేషన్ వరకు ప్రత్యామ్నాయ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే, ప్రస్తుతం ఉన్న మెట్రోఎక్స్ప్రెస్ మరియు మెట్రోలింక్ సేవలు, కొత్తగా ప్రారంభించిన మెట్రోలింక్ రూట్ M154తో సహా ఈ ప్రాంతాన్ని కవర్ చేయడానికి పనిచేస్తాయని పేర్కొన్నది.
వీటితోపాటు ప్రత్యామ్నాయ బస్సు మార్గాలు, సమీప బస్ స్టాప్ స్థానాలు మరియు సేవల ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోవడానికి స్టేషన్లలో ఏర్పాటు చేసిన గైడ్ లైన్స్ మ్యాప్ లను చూడాలని, అలాగే తాజా సమాచారం కోసం మెట్రో మరియు ట్రామ్ సోషల్ మీడియా ఛానెల్లను ఫాలో కావాలని మరియు కాల్ సెంటర్ 105ను సంప్రదించాలని వినియోగదారులకు ఖతార్ రైల్ సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్లో 12 కిలోల ఉల్కాశకలం గుర్తింపు..!!
- కువైట్లో 53 శాతం తగ్గిన నేరాలు సంఖ్య..!!
- ఫ్రాడ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష, బహ్రెయిన్ నుంచి బహిష్కరణ..!!
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
- అబుదాబి, దుబాయ్ పార్కింగ్ సేవలు అనుసంధానం.. ఒకే ప్లాట్ఫామ్ ద్వారా పేమెంట్స్..!!
- పర్యాటక రంగంలో సౌదీ అరేబియా దూకుడు.. జీడీపీలో 14.1 శాతం వాటా..!!
- ఖతార్ ఎయిర్వేస్ పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్..ప్రయాణికులకు హెచ్చరిక..!!
- భారతీయ పర్యాటకులకు ఉచిత యూఏఈ వీసా..అబుదాబి కొత్త హాలిడే ఆఫర్
- టీటీఈలకు బాడీ కెమెరాలు: రైల్వేలో కొత్త శకం
- ఆన్లైన్లో ఈ పనులు చేస్తే జైలుశిక్ష.. Dh500,000 ఫైన్..!!







