ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- June 23, 2026
దోహా: ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) లుసైల్ ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. నెట్వర్క్ అంతటా ముఖ్యమైన అభివృద్ధి పనులను చేయడానికి వీలుగా జూన్ 26నుండి జూలై 5 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడానికి మరియు ట్రామ్ నెట్వర్క్ పనితీరును మెరుగుపరచడానికి ఖతార్ రైల్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, రవాణా మంత్రిత్వ శాఖ సమన్వయంతో ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతోందన్నారు.
సేవలు నిలిపివేసిన సమయంలో ప్రయాణీకులకు సేవలు నిరంతరాయంగా కొనసాగేలా లెగ్తైఫియా స్టేషన్ నుండి తర్ఫత్ - సౌత్ స్టేషన్ వరకు ప్రత్యామ్నాయ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే, ప్రస్తుతం ఉన్న మెట్రోఎక్స్ప్రెస్ మరియు మెట్రోలింక్ సేవలు, కొత్తగా ప్రారంభించిన మెట్రోలింక్ రూట్ M154తో సహా ఈ ప్రాంతాన్ని కవర్ చేయడానికి పనిచేస్తాయని పేర్కొన్నది.
వీటితోపాటు ప్రత్యామ్నాయ బస్సు మార్గాలు, సమీప బస్ స్టాప్ స్థానాలు మరియు సేవల ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోవడానికి స్టేషన్లలో ఏర్పాటు చేసిన గైడ్ లైన్స్ మ్యాప్ లను చూడాలని, అలాగే తాజా సమాచారం కోసం మెట్రో మరియు ట్రామ్ సోషల్ మీడియా ఛానెల్లను ఫాలో కావాలని మరియు కాల్ సెంటర్ 105ను సంప్రదించాలని వినియోగదారులకు ఖతార్ రైల్ సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..







