ఖతార్‌లో కొత్తగా 240 కరోనా పాజిటివ్‌ కేసులు

- October 19, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా 240 కరోనా పాజిటివ్‌ కేసులు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 240 కరోనా పాజిఇవ్‌ కేసులు నమోదు కాగా, 244 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో రికవర్‌ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 126,640కి చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన 240 కేసుల్లో 215 కమ్యూనిటీ కేసులు కాగా, 25 ట్రావెల్‌ సంబంధిత కేసులు. మొత్తంగా కొత్త కేసులన్నిటినీ ఐసోలేషన్‌లో వుంచడం జరిగింది. ఇదిలా వుంటే, ఖతార్‌లో ఇప్పటిదాకా 224 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనాతో. మొత్తం 2,797 యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 129,671. ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నవారి సంఖ్య 384.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com