షార్జా బుక్ ఫెయిర్: ఆన్లైన్ అలాగే ఇన్-పర్సన్ పార్టిసిపేషన్ మిక్స్
- October 19, 2020షార్జా:ఈ ఏడాది షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో అమెరికన్ ర్యాపర్ మరియు సోషల్ మీడియా స్టార్ ప్రిన్స్ ఇఎ, కెనడియన్ రచయిత యెన్ మార్టెల్, ఎలిసాబెట్టా డామి వంటి ప్రముఖులు వర్చువల్గా సందడి చేయనున్నారు. 39వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్, ఎక్స్పో సెంటర్ షార్జాలో జరుగుతుంది. నవంబర్ 4 నుంచి 14 వరకు దీన్ని నిర్వహించనున్నాడు. ‘ది వరల్డ్ రీడ్స్ ఫ్రం షార్జా’ పేరుతో ఈ ఈవెంట్ని నిర్వహించనున్నారు. ఇండియన్ ఆథర్, పొలిటీషియన్ శశి థరూర్ అలాగే నోవలిస్ట్ రవీందర్సింగ్ టాక్స్ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణలు. కాగా, ఈ ఏడాది విజిటర్స్ సంఖ్యని రోజుకి 5 వేలే పరిమితం చేశారు. మూడు గంటల సమయం ఇస్తారు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారికే అవకాశం. కాగా, వర్చువల్గా కూడా బుక్ఫెయిర్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గత ఏడాది 2.52 మిలియన్ విజిటర్స్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ