ఖర్చులు పెరగడంతో బహ్రెయిన్ నిర్వాసితుల ఇబ్బందులు
- February 14, 2016వివిధ రాయితీలు తొలగించడంతో పెరిగిన ఖర్చుల కారణంగా బహ్రెయిన్ లో నిర్వాసితుల జీవనం ఎంతో దుర్బరంగా మారుతోంది. గత ఎనిమిదేళ్లుగా బహ్రెయిన్ లో నివసిస్తున్న అమీన్ నసీరుద్దీన్ ఈ ఏడాది చివరిలోపు దేశం విడిచి వెళ్లేందుకు నిర్ణయం తిసుకొన్నట్లు తెలిపాడు. పేరు తెలియచేయడానికి ఇష్టపడని మరో నిర్వాసితుడు పెరిగిన ధరల కారణంగా తనతో ఉంటున్న కుటుంబాన్ని తిరిగి స్వదేశంకు పంపుతున్నట్లు తెలిపాడు. అత్యధిక శాతం మంది బహ్రెయిన్ నిర్వాసితులు పెరిగిన ధరల కారణంగా తాము విదేశంలో ఉండాలా లేక స్వదేశం కు తిరిగి వెళ్ళాలో నిర్ణయించుకోలేక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. తక్కువ ఆదాయాలు ఉన్న ఉద్యోగులు , సాధారణ కార్మికులు పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఇంటి అద్దెలు , నెలవారీ బిల్లులు చెల్లించడానికి నానా తంటాలు పడుతున్నారు. అదే సమయంలో జీతం డబ్బులలో కొంత మొత్తాన్ని స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలకు పంపించేందుకు అవస్థలు చెందుతున్నారు. పెరిగిన ఖర్చులు తమ అల్ప జీతాలను హరించివేస్తున్నాయని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్బంగా వలస కార్మికుల రక్షణ సంఘం ( ఎం.డబ్ల్యూ.పి.ఎస్.) అధ్యక్షురాలు మరిఎత్త దాస్ మాట్లాడుతూ , పలువురు బహ్రెయిన్ నిర్వాసితులు బాద్యతల కారణంగా ఇదే దేశంలో ఉండిపోక తప్పడం లేదని తెలిపారు. వీరు అప్పులు తీర్చడానికి, కుటుంబ భారం మోయాల్సిన నేపధ్యంలో బహ్రెయిన్ విదిచివెళ్ళలేక ఇక్కడే ఉండిపోతున్నారని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ