కొనసాగుతోన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష
- October 27, 2020
కరీంనగర్:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష కొనసాగుతోంది. దుబ్బాక వెళ్తున్న తనపై సిద్దిపేట పోలీసు కమిషనర్ దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నారని, ఆయన్ని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన దీక్షతో పరిస్థితులు ఇంకాస్థ ఉద్రిక్తంగా మారింది. సీపీని బదిలీ చేసి కేసు నమోదు చేసేవరకు తాను దీక్ష విరిమించేదే లేదు అంటున్నారు. ఉదయం నుంచే బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు అంతా బండి సంజయ్ దీక్ష చేస్తున్న ప్రదేశానికి చేరుకొనే ప్రయత్నం చేయడం.. అదే సమయంలో బీజేపీ నేతల హౌస్ అరెస్టులతో పరిస్థితి రణరంగంగా మారింది.. నిన్నటి నుంచి జరుగుతున్న ఇష్యూలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఎక్కడికక్కడ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు, కార్యకర్తలు.. కొన్ని చోట్ల సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలు సైతం దహనం చేశారు.. మరోవైపు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..