వరద బాధితులకు ‘ఐటి దిగ్గజం కాగ్నిజెంట్‌' సాయం

- November 01, 2020 , by Maagulf
వరద బాధితులకు ‘ఐటి దిగ్గజం కాగ్నిజెంట్‌\' సాయం

హైదరాబాద్:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైన విషయం అందరికి విదితమే. తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ ఐటి దిగ్గజం "కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్" ముందుకొచ్చింది.
కంపెనీ యొక్క హైదరాబాద్‌ సెంటర్ ,తమ "ఔట్రీచ్" ప్రోగ్రాం ద్వారా వరద బాధిత కుటుంబాలకు తమవంతు బాధ్యతగా నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతోంది. విపత్కర సమయాల్లో బాధిత కుటుంబాలను ఆదుకుంటూ కాగ్నిజెంట్‌ కంపెనీ ఆదర్శంగా నిలుస్తోంది.ఇటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగులను కూడ భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలొ సేవాభావం పెంపొందించడం అన్నది గమనించదగ్గ విషయం.

--పవన్ బసిరెడ్డి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com