వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం
- November 01, 2020
సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా ( చి!!.రాజా భవాని శంకర శర్మ) వివాహం చి.ల.సౌ. వెంకటలక్ష్మి హిమబిందుతో 31-10-2020 ఉదయం హైదరాబాద్ లోని హోటల్ దస్ పల్లలో 10.55 నిమిషాలకు జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బర్రా సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'ఫిదా', 'మిస్టర్ మజ్ను', 'హ్యాపీ వెడ్డింగ్', 'అంతరిక్షం', 'రణరంగం', 'వి' సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించారు రాజా. పలు చిత్రాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ల్లోనూ కీలకపాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







